Saturday, April 27, 2024

ఆనందయ్య మందు పంపిణీని మొదలు పెట్టండి: టీడీపీ

ఆనందయ్య మందు పంపిణీని ఎందుకు నిలివేశారని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు తయారు చేసే విధానాన్ని టీడీపీ నేతలు సోమిరెడ్డి, టీడీపీ జాతీయ కార్యదర్శి బీద రవిచంద్ర పరిశీలించారు. ఆయుష్ కమిషనర్ రాములు ఆనందయ్య మందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పిన విషయాన్ని సోమిరెడ్డి గుర్తు చేశారు. నాయకులు, అధికారులు రాజకీయాలు పక్కన పెట్టి ఆనందయ్య మందు పంపిణీ జరిగేలా చూడాలని కోరారు. నివేదికలు సాకు చూపి కాలయాపన చేయకుండా ఆనందయ్య ముందు పంపిణీ జరిగేలా సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆనందయ్య మందువల్ల దేశం మొత్తం కృష్ణపట్నం వైపు చూస్తోందని సోమిరెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement