Sunday, April 28, 2024

వైసీపీ బెదిరించినా బరిలో దిగారు: టీడీపీ నాయకులకు లోకేష్ ప్రశంసలు

ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై నారా లోకేష్ స్పందించారు. వైసీపీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలను ఆపేస్తామని బెదిరించి ఈ ఎన్నికలను నిర్వహించారని లోకేశ్ విమర్శించారు. ఇక ఎన్నికల్లో గెలుపు కోసం రాత్రనక, పగలనక పని చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు. నామినేషన్ వేస్తే చంపేస్తామని వైసీపీ నేతలు భయపెట్టినా భయపడక టీడీపీ సైనికులు ఎన్నికల బరిలోకి దిగారని ప్రశంసించారు. ఈ ఫలితాలతో టీడీపీ శ్రేణులు నిరాశకు గురికావద్దని అన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉందామని, ప్రజా సమస్యలపై పోరాటాన్ని కొనసాగిద్దామని..పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు లోకేష్.

Advertisement

తాజా వార్తలు

Advertisement