Friday, April 19, 2024

హైద‌రాబాద్ లో తాడిపత్రి టిడిపి కౌన్సిలర్ల క్యాంప్

అనంతపురం: ఈ నెల 18వ తేదిన జ‌ర‌గ‌నున్న చైర్మ‌న్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో తాడిపత్రి మున్సిపాలిటీలోని టీడీపీ కౌన్సిలర్లను ఆ పార్టీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, పవన్ రెడ్డిలు తరలించారు. తాడిపత్రి మున్సిపాలిటీ లో మొత్తం వార్డులు 36 ఉన్నాయి. టీడీపీ 18 వార్డులలో విజయం సాధించింది. వైసీపీ 16 స్థానాలలో గెలుపొందింది. సీపీఐ 1, ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలుపొందారు. వైసీపీకి రెండు ఎక్స్అఫిషియో ఓట్లు ఉన్నాయి..దీంతో రెండు పార్టీల బ‌ల‌బ‌లాలు స‌మానంగా మారాయి. సీపీఐ , ఇండిపెండెంట్ అభ్య‌ర్ధులు ఎవ‌రికి మ‌ద్ద‌త్తు ఇస్తే వారికే ఛైర్మన్ పీఠం ద‌క్కుతుం‌ది. దీంతో తమ అభ్యర్థులను వైసీపీ నాయకులు ప్రలోభ పెడతారని భావించి వారిని ఎవరికీ తెలియని ప్రదేశానికి జేసీ సోదరులు తరలించారు. టీడీపీ కౌన్సిలర్లతో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డి హైద‌రాబాద్ లో మ‌కాం వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement