Thursday, May 2, 2024

ఎక్స్ అఫీషియోలకు చుక్కెదురు

మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ అంతటా ఫ్యాన్ గాలి వీచినా అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో మాత్రం ప్రతిపక్షం టీడీపీ ఎదురొడ్డింది. కానీ ఎక్స్ అఫీషియో ఓట్లతో దానిని కూడా సొంతం చేసుకునేందుకు అధికార వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తమ ఓటు హక్కు కోసం నలుగురు ఎమ్మెల్సీలు దరఖాస్తు చేసుకోగా వీరిలో ముగ్గురు అధికార పార్టీకి చెందిన వారు, టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఉన్నారు. అయితే వీరికి ఓటు వేసే అర్హత లేదని వీరి అభ్యర్థనను కమిషనర్ తిరస్కరించారు. తాడిపత్రిలో ఓటు లేకపోవడమే తిరస్కరణకు కారణమన్నారు. కాగా తాడిపత్రి మున్సిపాలిటీలో 36 వార్డులకు టీడీపీ 18, వైసీపీ 16, సీపీఐ 1, ఇతరులు 1 గెలవడంతో సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు కీలకం కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement