Tuesday, May 7, 2024

ప్రతి స్కీమూ పెద్ద స్కామ్: దేవినేని ఉమ

రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ దోపిడీ జ‌రుగుతోంద‌ని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వర‌రావు అన్నారు. ప్రతి స్కీమూ పెద్ద స్కామ్ ఉందని ఆరోపించారు. ‘ఇసుకలో రూ.10 వేల కోట్లు, ఇళ్ల పట్టాల్లో రూ.16,500 కోట్లు కొట్టేశారు. వైన్, మైన్, ల్యాండ్, శ్యాండ్ దోపిడి. ప్రతి స్కీమూ పెద్ద స్కామ్. హోల్ సేల్‌గా అవినీతి. నదుల అనుసంధానం చిదిమేశారు. పోలవరంపై బూటకపు ప్రకటనలు, నిర్వాసితుల ఊసే లేదు. రివర్స్ టెండరింగ్‌తో ప్రాజెక్టులన్నీ నత్తనడక వాస్తవం కాదా?’  అని సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను దేవినేని ఉమ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement