Friday, April 26, 2024

అక్రమార్కులపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పండి?: దేవినేని

ఏపీ ప్ర‌భుత్వ తీరుపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మండిప‌డ్డారు. ఖరీఫ్ సీజ‌న్‌ సాగు ప్రారంభం కావడంతో నకిలీ పత్తి విత్తనాల విక్రయాలు యథేచ్ఛగా కొసాగుతున్నాయని ఆయన అన్నారు. ‘మార్కెట్లో యథేచ్ఛగా నకిలీ పత్తి విత్తనాలు. ప్యాకెట్లలో వివిధ పేర్లతో జోరుగా లూజు విత్తనాల విక్రయాలు. ఏటా నష్టపోతున్న రైతులు. నామమాత్రపు దాడులతో సరి. దళారులతో కుమ్మక్కై లబ్ది. ధరలు లేక ఇబ్బందులు పడుతుంటే నకిలీలతో మరింత నష్టం. అక్రమార్కులపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పండి? వైఎస్ జ‌గ‌న్’ అంటూ దేవినేని ఉమ ప్రశ్నించారు.  

ఇదీ చదవండి: వీళ్లు పోలీసులా? లేక గూండాలా?

Advertisement

తాజా వార్తలు

Advertisement