వరుసగా రెండో ఏడాది మామిడి రైతులకు తీవ్ర నష్టాలు వచ్చాయని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. ధర పతనంతో పెట్టుబడి కూడా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలతో లారీలు సైతం తోటల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇంకా దాదాపు 50 శాతం కాయలు తోటల్లోనే ఉన్నాయని ఆందోళన చెందుతున్న రైతుల కష్టాలు జగన్కు కనబడుతున్నాయా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement