Wednesday, April 24, 2024

ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్..

అమరావతి : సంగం డెయిరీ లో అక్ర‌మాల‌కు పాల్పడ్డార‌నే ఆరోప‌ణ‌ల‌పై అరెస్ట్ అయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‎కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 4 వారాల పాటు విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో ఉండాలని ధూళిపాళ్లను కోర్టు సూచించింది. విజయవాడలో ఉండే అడ్రస్‌ను దర్యాప్తు అధికారులకు ఇవ్వాలని, విచారణకు పిలవాలంటే 24 గంటల ముందు నోటీస్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత నెల 23న ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. జైల్లో ఉండగానే ధూళిపాళ్ల కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ధూళిపాళ్ల చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement