గుడివాడకు గోవా సంస్కృతిని తీసుకొచ్చారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. క్యాసినో వల్ల కోట్లాది రూపాయలు చేతులు మారాయని చెప్పారు. క్యాసినో నిర్వహించి ఓ కేబినెట్ మంత్రి దొరికిపోయారని అన్నారు. గోవా సంస్కృతిని ఆ బూతుల మంత్రి గుడివాడకు తీసుకొచ్చారని ఆరోపించారు.
రాష్ట్రంలోని పరిస్థితులపై ప్రజలకు సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అండదండలతోనే క్యాసినో సంస్కృతి కొనసాగుతోందని ఆరోపించారు. గుడివాడలో క్యాసినో నిర్వహిస్తే రూ.500 కోట్లు వచ్చాయని, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తే ఎన్ని వందల కోట్ల రూపాయలు వస్తాయో అని సీఎం జగన్ ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు.