Saturday, April 27, 2024

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి: టీడీపీ

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలని టిడిపి కడప,రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు లింగారెడ్డి, శ్రీనివాసరెడ్డిలు డిమాండ్ చేశారు. సోమవారం కడప టిడిపి కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ సొంత కుటుంబంలో హత్య జరిగితే పట్టించుకోని జగన్.. ప్రజలను ఏవిధంగా కాపాడుతాడని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరోనా వచ్చి వెళ్ళిపోయింది కానీ జగన్ మాత్రం వర్క్ ఫర్ హోమ్ ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు వేధింపులు తప్ప ఆయన చేసింది ఏమీ లేదన్నారు. ఓటియస్ ను, రద్దు చేయాలని, వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించే కార్యక్రమం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక అక్రమ రవాణా,మైనింగ్ అక్రమాలపై ఈనెల 25 న నిరసన కార్యక్రమం చెపడతామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement