Friday, April 26, 2024

Big Breaking | భవిష్యత్​కు టీడీపీ భరోసా.. మహానాడు వేదికగా ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్​

తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా ఇవ్వాల (ఆదివారం) రాత్రి తన ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్​ చేసింది. భవిష్యత్​కు టీడీపీ గ్యారెంటీ పేరుతో ఈ మేనిఫెస్టోని విడుదల చేసింది. ఇందులో పలు కీలక తీర్మాణాలను మహానాడు వేదికగా చర్చించి ఆమోదించారు.

ఇక.. 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల ఒక్కొక్కరికి 15 వందల రూపాయలు అకౌంట్లో జమ చేయనున్నారు. తల్లికి వందనం పథకం కింది ఏడాదికి రూ.15 వేలు అందివ్వనున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లులుంటే అందరికీ ఈ పథకం వర్తించనుంది.  ఇంటికి నీరు పథకం కింద ప్రతి ఇంటికి కుళాయి, రైతుల కోసం అన్నదాత పథకం.. దీనిలో  ఏటా రూ.20వేల ఆర్థిక సాయం అందిస్తారు. యువతకోసం యువగళం పథకం, ఈ యువగళం పథకం కింద ప్రతి నిరుద్యోగికి నెలకు 3వేలు ఇవ్వనున్నట్టు టీడీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement