Friday, April 26, 2024

Awards | మూడు పంచాయతీలకు జాతీయ అవార్డు.. ఈనెల 5న ఢిల్లీలో ప్రదానం

అమరావతి, ఆంధ్రప్రభ : నేషనల్‌ ఎన్విరాన్‌మెంట్‌ డే సందర్భంగా రాష్ట్రంలోని కొన్ని పంచాయతీలకు జాతీయ పంచాయతీ అవార్డులకు కేంద్రం ఎంపిక చేసింది. ప్రతి ఏటా జూన్‌ 5వ తేదీన జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రధానం చేయడం ఆనవాయితీ. అందులో భాగంగా దేశ వ్యాప్తంగా 100 పంచాయతీలను ఎంపిచేయగా రాష్ట్రంలోని మూడు పంచాయతీలకు ఈ అరుదైన గౌరవం దక్కింది.

అందులో తూర్పు గోదావరి జిల్లాలోని బిల్లనందూరు, విజయనగరం జిల్లాలోని జోగింపేట, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కడలూరు పంచాయతీలు ఈ జాతీయ పురస్కారానికి కేంద్రం ఎంపిక చేసింది. దేశ రాజధాని ఢిల్లిdలో జూన్‌ 5 వ తేదీన జరగబోయే జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయా పంచాయతీలకు ఈఅవార్డులను కేంద్రం ప్రధానం చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement