Saturday, May 4, 2024

AP: చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న టీడీఎల్పీ భేటీ.. అసెంబ్లీలో ప్ర‌స్తావించే అంశాల‌పై చ‌ర్చ

ఆంధ్రప్ర‌దేశ్‌ అసెంబ్లీ స‌మావేశాలు రేప‌టి (గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న ఇవ్వాల (బుధ‌వారం) పార్టీ శాస‌న స‌భాప‌క్ష భేటీ జ‌రిగింది. మంగ‌ళ‌గిరి ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో జ‌రిగిన ఈ స‌మావేశంలో అసెంబ్లీ స‌మావేశాల్లో టీడీపీ అనుస‌రించాల్సిన వ్యూహంపై చ‌ర్చ జ‌రిపారు. శాస‌నస‌భా స‌మావేశాల్లో మొత్తంగా 15 అంశాల‌ను లేవ‌నెత్తాల‌ని టీడీఎల్పీ నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం..

ఇక‌.. అమ‌రావ‌తిలో అక్ర‌మాల పేరిట కేసులు న‌మోదు చేస్తున్న తీరుపై ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల‌ని టీడీఎల్పీలో తీర్మానించారు. రైతులు చేప‌ట్టిన మ‌హాపాద‌యాత్ర నేప‌థ్యంలో అమ‌రావ‌తిలో అక్ర‌మాల‌ని సీఐడీ తాజాగా అరెస్ట్‌ల‌కు దిగిన విషయాన్ని ప్ర‌ధానంగా ప్ర‌స్తావించాల‌న్నారు. అస‌లు ఎలాంటి లావాదేవీలే జ‌ర‌గని అంశాల‌పై కేసులేమిట‌ని టీడీఎల్పీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. త‌ప్పుడు కేసులు పెడుతున్న సీఐడీ అధికారుల‌పై ప్రైవేట్ కేసులు వేసే విష‌యంపైనా ఈ భేటీలో చ‌ర్చ జ‌రిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement