Tuesday, April 30, 2024

భార్య‌మీద అనుమానంతో సైకోలా మారిన భ‌ర్త‌.. ఇద్ద‌రు పిల్ల‌ల‌ను కెనాల్‌లో తోసి చంపేశాడు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లాలో దారుణం జ‌రిగింది. భార్య‌మీద కోపంతో పిల్ల‌ల‌ను కెనాల్‌లో ప‌డేసి హ‌త‌మార్చాడో తండ్రి. ఈ దారుణం తాడేప‌ల్లి మండ‌లంలో జ‌రిగింది. భార్య మీద అనుమానంతో సైకోలా మారిపోయాడు వెంక‌టేశ్వ‌ర‌రావు. ముక్కు పచ్చాలరాని త‌న పిల్లలను కుంచనపల్లిలోని బకింగ్‌హాం కెనాల్‌లో ప‌డేశాడు.

అయితే.. త‌మ పిల్ల‌లు జోష్ణ (6) షణ్ముఖ వర్మ (4) నిన్నటి నుంచి కనిపించడం లేద‌ని పెద్దకాకాని పోలీస్ స్టేషన్లో తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసి విచార‌ణ చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో తండ్రే పిల్ల‌ల‌ను చంపేసిన‌ట్టు వారి ఎంక్వైరీలో వెల్ల‌డ‌య్యింది. గజ ఈతగాళ్ల సహాయంతో బకింగ్ హామ్ కెనాల్ లో సెర్చ్ చేయ‌గా.. ఇద్దరి చిన్నారుల మృతదేహాలు దొరికాయి. దీనిపై కేసు న‌మోదు చేసి త‌దుప‌రి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement