Monday, May 6, 2024

చంద్రబాబు, బొండా ఉమకు ‘మహిళా కమిషన్’ సమన్లు

టీడీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీ సీనియర్ నేత బొండా ఉమకు రాష్ట్ర మహిళా కమిషన్ శుక్రవారం సమన్లు జారీ చేసింది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచార బాధితురాలిని పరామర్శించే క్రమంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను అగౌరవపరచడం.. బాధితురాలి ఆవేదన విననీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడం.. అత్యాచార బాధితురాలిని భయకంపితం చేసిన సంఘటనలపై విచారణకు చంద్రబాబు, బొండా ఉమ వ్యక్తిగతంగా హాజరు కావాలని మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. ఈనెల 27న ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి చంద్రబాబు, బొండా ఉమ స్వయంగా విచారణకు రావాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సమన్లలో ఆదేశించారు.

కాగా, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సామూహిక అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు మాజీ సీఎం చంద్రబాబు, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ విజయవాడ ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆమెని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్వల్ప వాగ్వాదం చోటుచేకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement