Saturday, April 27, 2024

AP: శ్రీశైలంలో.. ఆలయ శివాజీ గోపురంపై నాగుపాము

కర్నూలు : శ్రీశైలం ఆలయ గోపురంపై ఆదివారం నాగుపాము కలకలం రేపింది. దసరా మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం శివాజీ గోపురంను ముస్తాబు చేస్తున్న లైటింగ్ సిబ్బందికి నాగుపాము కనిపించింది. దీంతో భయభ్రాంతులకు గురయ్యారు.

ఈ విషయాన్ని వెంటనే దేవస్థానం అధికారులకు తెలియజేశారు. అధికారులు వెంటనే పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు. అనంతరం పామును పట్టుకుని స్థానికంగా అడవిలో వదిలేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement