Tuesday, April 30, 2024

AP: ఎన్నికల విధులు పట్ల అలసత్వం వద్దు…కలెక్టర్ మనజీర్

నరసన్నపేట, ఫిబ్రవరి 15(ప్ర‌భ‌న్యూస్‌): ఎన్నికల విధులు పట్ల అలసత్వం వద్దని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ అన్నారు. గురువారం పర్యటన లో భాగంగా నరసన్నపేట తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి కార్యాలయంలో రికార్డులు, వివిధ స్థాయి అధికారుల పనితీరును పరిశీలించారు.

కొత్తగా చేర్పులు, మార్పులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు.ఓటర్ నమోదులో ఫారం 6 తీసుకునేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవాలని తహ‌సిల్దార్ కు సూచించారు. నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు ఉండాలని, ఆర్ఓలు, ఏఆర్ఓలు ప్రతి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం నరసన్నపేట సచివాలయాన్ని పరిశీలించి పౌరు సేవల పై ఆరా తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement