Thursday, April 25, 2024

AP: రూ. 50 లక్షల ఎంపీ నిధులతో… క‌ళ్యాణ మండ‌పాన్ని ప‌రిశీలించిన బుల్లిబాబు

కశింకోట,జనవరి30(ప్రభ న్యూస్): మండలకేంద్రమైన కశింకోట గ్రామంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బిసెట్టి వెంకట సత్యవతి నిధులతో నిర్మించనున్న ఇందిరా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంగళవారం జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా బుల్లిబాబు మాట్లాడుతూ కశింకోట గ్రామ అభివృద్ధిలో మంత్రి గుడివాడ ఆమర్నాధ్ తోపాటు, ఎంపీ సత్యవతి కూడా సహకారం అందిస్తున్నారని చెప్పారు.

అలాగే మంత్రి ఆమర్నాధ్ సహకారంతో గ్రామంలో జరిగిన కోటి రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. కళ్యాణ మండపం వెళ్లే దారిలో దారి వైడింగ్ వేసి రోడ్డు చేపట్టే పనులను పరిశీలించారు. స్థల పరిశీలనలో పంచాయతీ రాజ్ డీ.ఈ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి రమేష్ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement