Thursday, May 2, 2024

AP: కేశినేనీ.. ద‌మ్ముంటే నాపై పోటీ చెయ్.. బుద్దా వెంక‌న్న‌

గుండెలో దమ్ము, ధైర్యం ఉంటే తనపై పోటీ చేయాలంటూ ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబును సవాల్ చేసిన కేశినేని నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న మాటల దాడికి దిగారు. విజ‌య‌వాడ‌లో ఆయ‌న నేడు మీడియాతో ఆయన మాట్లాడుతూ… కేశినేని నాని రంగులు మార్చే ఓ రాజకీయ వ్యభిచారి అని ధ్వజమెత్తారు. ఇన్నాళ్లు టీడీపీలో ఉండి వైసీపీ కొమ్ము కాశాడని ఆయన మండిపడ్డారు. ఏనాడు ఆయన టీడీపీ సంక్షేమానికి పాటుపడలేదని, నాయకులతో సరిగ్గా కలిసి పని చేయలేదని ఆరోపించారు. వైసీపీ నాయకులతో సన్నిహితంగా ఉంటూ కోవర్టు రాజకీయాలు చేశారని మండిపడ్డారు. కేశినేని నాని కోవర్టు అయితే, వల్లభనేని వంశీ అంతకన్నా పెద్ద కోవర్టు అంటూ ధ్వజమెత్తారు. నిరంతరం తాను ప్రజా క్షేత్రంలో ఉంటే తనపై అధినేత చంద్రబాబుకు ఫిర్యాదులు చేశారన్నారు. ఎవరెన్ని మాటలు చెప్పినా.. చంద్రబాబు ఎవ్వరి మాటలను నమ్మలేదని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.

మూడు లక్షల ఓట్ల మెజారిటీతో ఈసారి నాని ఓడిపోతున్నాడు.. నోరు ఉంది కదా అని పిచ్చిపిచ్చిగా వాగితే.. తగిన బుద్ది చెబుతాం.. టీడీపీని ఖాళీ చేస్తాం అన్న వాడివి.. ఆరుగురిని కూడా తీసుకెళ్లలేకపోయావు.. నిన్ను నమ్మి ఎవరైనా టీడీపీని వీడి వైసీపీలోకి వస్తారా.. దేవినేని నెహ్రూని విమర్శించిన కేశినేని నాని.. ఇప్పుడు దేవినేని అవినాష్ కు అనుచరుడిగా మారిపోయాడన్నారు.. కేశినేని నానికి మతి భ్రమించి, పిచ్చి పట్టి వాగుతున్నాడు.. కేశినేని భవన్ కు టీడీపీ నుంచి కొంతమందైనా వెళ్లేవారు.. ఇప్పుడు పూర్తిగా ఖాళీ అయిపోయి.. ఒక్కడే కూర్చుంటున్నాడు.. ఒంటరి అయిపోయి.. పిచ్చి ముదిరి.. నాని పిచ్చిపట్టినట్లుగా కూస్తున్నాడు.. మానసిక వైద్య నిపుణులకు నానిని చూపించాలని ఆయన కుటుంబ సభ్యులను కోరుతున్నా అన్నారు. మూడు లక్షల ఓట్లతో నాని ఓడిపోవడం ఖాయం.. పిచ్చిపిచ్చిగా వాగితే.. కేశినేని నాని భవన్ వద్దకు వచ్చి నాలుక కోస్తాం.. నీకు దమ్ముందా నా దగ్గరకు రావడానికి.. టీడీపీలో నీ ఇష్టం వచ్చినట్లు చేసినా.. చంద్రబాబును చూసి ఊరుకున్నాం.

వాపు ని చూసి బలుపు అనుకుని పిచ్చిపిచ్చిగా మాట్లాడతావా అన్నారు. ఎన్నో ఫైనాన్స్ కంపెనీలు ఎత్తేసిన చరిత్ర కేశినేని నానిదన్నారు. చంద్రబాబు కాళ్ళ మీద పడిన నాని.. బయటకు వచ్చాక కూస్తున్నాడన్నారు. ఇంకోసారి వాగితే.. నీ బండారం మొత్తం బయట పెడతామ‌న్నారు. పిచ్చి వేషాలు వేస్తే.. నీ బట్టలు సర్ది నెత్తిన పెట్టి.. ఆంధ్రా బోర్డర్ లో వదిలి పెడతామ‌న్నారు. చంద్రబాబు నమ్మి రెండుసార్లు ఎంపీ చేస్తే.. నీ బతుక్కి ఆయన్ని తిడతావ.. నాలుగున్నరయేళ్లకు పైగా జగన్ పై మేము దమ్ముగా పోరాటం చేశామ‌న్నారు. నువ్వు పిరికి పంద కాబట్టే.. కోవర్టు రాజకీయాలతో పబ్బం గడుపుకున్నావన్నారు. ఆయా రామ్, గయా రామ్ లకు కేశినేని నాని అధ్యక్షుడు అన్నారు. నీ వల్ల మెజార్టీ వచ్చిందా.. రేపు రా.. నిన్ను ఎలా తరిమి కొడతారో తెలుస్తుందన్నారు. నీకు మంచిగా చెబుతున్నాం.. కేశినేని భవన్ వద్దకు వచ్చే వరకు తెచ్చుకోవద్దని అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement