Saturday, April 27, 2024

జల వివాదంపై పోరాడండి: సోము వీర్రాజు పిలుపు

ఏపీకి నీటి విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. సోమవారం విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశమైంది. పార్టీ రాష్ట్ర నాయకులు, ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు నేరుగా పాల్గొనగా… జూమ్ ద్వారా ఏపీ ఇంచార్జ్ మురళీధరన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు, ఉద్యోగ క్యాలెండర్, కొత్త ఇసుక పాలసీ, నీటిపారుదల ప్రాజెక్ట్‌లపై రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదంపై చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని సోము డిమాండ్ చేశారు. కృష్ణా, గోదావరి, తుంగభద్ర నీటి కేటాయింపులో తెలంగాణ వివాదాలు సృష్టిస్తోందని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం అన్ని పార్టీలు, నిపుణులతో చర్చించి పోరాడాలని సోము వీర్రాజు డిమాండ్​ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement