Saturday, May 4, 2024

2024లో బీజేపీ బ‌ల‌మేంటో చూపిస్తామ‌న్న సోము వీర్రాజు

2024లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో బీజేపీ బ‌ల‌మేంటో చూపిస్తామ‌ని ఆ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ…. రాష్ట్రంలో అధికార పార్టీ డ‌బ్బు విచ్చ‌ల‌విడిగా పంచి ఎన్నిక‌ల్లో గెలుస్తున్నార‌న్నారు. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుంద‌న్నారు. ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా పోటీ చేశామ‌న్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రానికి బిజెపి అవసరం ఉందని పేర్కొన్న ఆయన మంచి పరిపాలన అందించడం బీజేపీ లక్ష్యమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి జరగాలంటే అది బిజెపితోనే సాధ్యమని పేర్కొన్న సోము వీర్రాజు, 2024 లో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement