Thursday, May 2, 2024

తిరుమల భ‌క్తుల‌కు షాక్‌.. ఎల్‌ఈడీ స్క్రీన్‌పై సినిమా పాటలు ప్ర‌త్య‌క్షం

పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఏర్పాటు చేసిన భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లపై సినిమా పాటలు ప్రసారమయ్యాయి. దీంతో ఒక్కసారిగా భక్తులు విస్మయానికి గురయ్యారు. నిత్యం గోవింద నామస్మరణ, అన్నమయ్య సంకీర్తనలు, వివిధ భక్తి గీతాలతో మార్మోగే తిరుమల గిరులపై సినిమా పాటలు దాదాపు అరంటపాటు ప్రసారం కావడంతో భక్తులు విస్తుపోయారు.

ఇవ్వాల సాయంత్రం 5.45 గంటల నుంచి 6.15 గంటల వరకు షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్ద ఏర్పాటు చేసిన భారీ ఎల్‌ఈడీ తెరపై సినిమా పాటలు ప్రసారమయ్యాయి. ఓ వైపు సినిమా పాటల దృశ్యాలు, బ్యాక్‌ డ్రాప్‌లో గోవింద నామాలు ప్రసారం ప్రసారమ్యాయి. దీంతో సిబ్బంది తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement