Sunday, April 28, 2024

Bapatla: సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ కు తప్పిన ఘోర ప్రమాదం

బాపట్ల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం వద్ద సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ రైలుకు ఘోర ప్రమాదం తప్పింది. ఈపురుపాలెం రైల్వే స్టేషన్ కు రైల్వే బ్రిడ్జికి మధ్యలో ఆప్ లైన్ విజయవాడ నుండి చెన్నై వెళ్లే రైలు మార్గంలో రైలు పట్టాకు వెల్డింగ్ విరిగిపోవడంతో గమనించిన రైల్వే సిబ్బంది అదే సమయంలో చెన్నై వైపుlకు వెలుతున్న సంఘమిత్ర 12296 రైలును నిలుపుదల చేశారు. విరిగిన రైలు పట్టాకు వెల్డింగ్ పనులు పూర్తి చేసి సంఘమిత్ర ట్రైన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రైల్వే సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతో పెనుప్రమాదం తప్పింది. ఇటువంటి ప్రమాదం జరగకపోవడంతో రైలులో ఉన్న ప్రయాణికులు, రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement