Wednesday, May 1, 2024

New DGP – ఎపికి పోలీస్ కొత్త బాస్ ఎవ‌రు?

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం కీలకమైన అంశాలపై దృష్టి సారిస్తోంది. ముందు ముందు ఎన్నికల ఏడాది కావడంతో శాంతి భద్రతలు అత్యంత ప్రధానంగా మారాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య నెలకొందని ప్రతిపక్ష, రాజకీయ పార్టీలు విమర్శలు సంధిస్తున్న తరుణంలో పోలీసుశాఖ ను పటిష్టం చేయడంతోపాటు వచ్చే ఎన్నికల దృష్ట్యా ఎన్నికల నిర్వహణ సమర్ధవంతంగా జరగాలి. అందుకు పోలీసుశాఖను పూర్తి స్ధాయిలో సమాయత్తం చేయాల్సి ఉంది. సరిగ్గా ఎన్నికల ముందు పోలీసుశాఖపై ప్రతిపక్షాల ఆరోపణలకు అవకాశం ఇవ్వకూడదు. అందుకే ఇప్పుడే అంతా సెట్‌రైట్‌ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో డీజీపీ వ్యవహారం తెర మీదకు వచి ్చంది. ప్రస్తుతమున్న డీజీపీ కెవి రాజేంద్రనాధ్‌ రెడ్డి ఇన్‌ఛార్జిగా మాత్రమే కొనసాగుతున్నందున ప్రభుత్వానికి డీజీపీ నియామకం అత్యంత కీలకంగా మారినట్లు తెలుస్తోంది. ఇప్పుడిదే అటు ప్రభుత్వ వర్గాల్లోనూ, ఇటు పోలీసు శాఖలోనూ హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పుడున్న కసిరెడ్డినే కొనసాగించేలా కేంద్రం ఆమోదం లభించేలా లాంఛనాలు పూర్తి చేస్తారా లేక కొత్త డీజీపీ నియామకం చేపడతారా అన్న చర్చ కొనసాగుతోంది.

అయితే రాజేంద్రనాధ్‌ రెడ్డి కన్నా సీనియర్లు రేస్‌లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎవరిని కోరుకుంటుందోనన్న సందేహంపై ఐపీఎస్‌ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కెవి రాజేంద్రనాధ్‌ రెడ్డిని తప్పిస్తే రేస్‌లో ఉన్నట్లు చెబుతున్న ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ పి సీతారామాంజనేయుల కు రాష్ట్ర పోలీసు ఫోర్స్‌ చీఫ్‌గా అవకాశం ద క్కనుందని విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇదిలావుంటే డీజీపీ నియామకానికి సంబంధించి యుపీఎస్‌సీ నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. ప్రస్తుతం ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్న రాజేంద్రనాధ్‌ రెడ్డి నియామకాన్ని ఆమోదం తెలియచేయాలన్నా.. ఇంకెవరినైనా నియమించాలన్నా యుపీఎస్‌సీ సూచించిన వారిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం నియమించుకోవచ్చు. తాజా పరిస్ధితుల నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కసిరెడ్డితోపాటు మరో ఐదు పేర్లతో కలిపి డీజీపీ నియామకం కోసం సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.

16 నెలలుగా ఇన్‌ఛార్జి హోదాలోనే..
ఏసీబి డీజీగా నియమితులైన కెవి రాజేంద్రనాధ్‌ రెడ్డి గత 16 నెలలుగా ఇన్‌ఛార్జి డీజీ హోదాలోనే కొనసాగుతున్నారు. రాష్ట్ర డీజీపీ విధులతోపాటు ఏసిబి చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన ప్రభుత్వం కసిరెడ్డిని డీజీపీగా నియమించింది. అప్పటి వరకు ఇంటిలిజెన్స్‌ డీజీగా ఉన్న ఆయన్ను అక్కడి నుంచి రిలీవ్‌ చేసి ఇన్‌ఛార్జి డీజీగా నియమించిన దాదాపు వారం తర్వాత ఏసిబి డీజీగా ఫుల్‌ ఛార్జి ఇస్తూ జగన్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి యుపీఎస్‌సీ ద్వారా నియామకం జరగాలి. నియమితులైన అధికారి కనీసం రెండేళ ్ళపాటు పదవిలో కొనసాగాల్సి ఉంటుంది.

అయితే ప్రభుత్వం రాజేంద్రనాథ్‌రెడ్డి విషయంలో డీజీపీగా నియమించినప్పటికీ కేంద్రానికి ప్యానెల్‌ పంపలేదు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఇన్‌ఛార్జిగా ఎక్కువ కాలం కొనసాగడం కుదరనందున ఆయన పేరు సహా డీజీ ర్యాంకు అధికారుల పేర్లతో జాబితా పంపాలంటూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో రెండు సార్లు లేఖలు రాసింది. ప్రభుత్వం నుంచి స్పందన లేనందున ఈ ఏడాది జనవరిలో డీఓపీటీ నుంచి మరో లెటర్‌ వచ్చినట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరిగింది. ఈనేపధ్యంలో రానున్న ఎన్నికల దృష్ట్యా, ప్రస్తుత పరిస్ధితుల రిత్యా డీజీపీ నియామకంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం తాజాగా 1992 బ్యాచ్‌కు చెందిన కెవి రాజేంద్రనాధ్‌ రెడ్డి, హరీష్‌ కుమార్‌ గుప్తా, పి. సీతారామాంజనేయులుతోపాటు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులైన ఏఆర్‌. అనురాధ (1987), ద్వారకా తిరుమల రావు (1989), మహమ్మద్‌ హసన్‌ రజా (1991) ఈ ఐదుగురి పేర్లతో ప్యానల్‌ పంపినట్లు ఐపీఎస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

ఎవరికి ఛాన్స్‌..?
కాగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానల్‌లోని పేర్లను పరిశీలించిన మీదట యుపీఎస్‌సీ ముగ్గురిని ఎంపిక చేసి తిరిగి పంపుతుంది. వారిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమించుకుంటుంది. ఇన్‌ఛార్జిగా ఉన్న రాజేంద్రనాధ్‌ రెడ్డి విషయంలో ఇది జరుగకుంటే ఇబ్మందులు తలెత్తే అవకాశం లేకపోలేదని ఒకవేళ ఎన్నికల ఏడాదిలో ప్రభుత్వం ప్రాధాన్యత, సామాజిక, రాజకీయ, ఇతర సమీకరణ నేపధ్యంలో మరో ఆలోచన చేస్తే కనుక ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ పి సీతారామాంజనేయులు డీజీపీగా నియామకమయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.1992 బ్యాచ్‌కు చెందిన పిఎస్సార్‌కు 2026 ఆగష్టు వరకు పదవీ కాలం ఉంది . ఇక సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన 1989 బ్యాచ్‌కు చెందిన ఆర్టీసి ఎండి ద్వారకా తిరుమలరావుకు ఛాన్స్‌ వచ్చే అవకాశం లేకపోలేదని సీనియర్లు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వం పంపిన ప్యానల్‌లో తిరుమలరావు పేరు యుపీఎస్‌సీ తిరిగి పంపే ముగ్గురిలోనూ ఉంటుందని ఆ ముగ్గురిలో తిరుమలరావును ఎంపిక చేసే విషయంలో ఇక రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని అయితే ఆయన అన్ని విధాల అర్హత కలిగిన అధికారిగా చర్చ జరుగుతోంది. ఈయనకు 2025 వరకు పదవీ కాలం ఉంది. తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్లు- ప్రచారం జరుగుతోంది. 92 బ్యాచ్‌కు చెందిన మరో సీనియర్‌ అధికారి హరీష్‌ కుమార్‌ గుప్తాకు 2025 వరకు పదవీ కాలం ఉంది. ఈయన ప్రస్తుతం హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన హాసన్‌ రేజా పదవీ కాలం జూలైతో ముగియనుంది. అదేవిధంగా 1987 బ్యాచ్‌కు చెందిన అనురాధకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిటైర్డ్‌ అవుతారు. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం ఆమె వైపు మొగ్గు చూపితే పదవీ కాలం పొడిగించే అవకాశం ఉంటుంది.

డీజీ క్యాడర్‌ లో ఉన్న అధికారులు..
స్టేట్‌ కేడర్‌లోని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల్లో డీజీ హోదా కలిగిన సీనియర్ల జాబితాలో మరి కొందరు అధికారులూ ఉన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు ప్రస్తుతం ప్రభుత్వంతో న్యాయపోరాటం చేస్తున్నారు. ఇక 1990 బ్యాచ్‌కు చెందిన అంజనా సిన్హా , అంజనీ కుమార్‌ ప్రస్తుతం తెలంగాణాలో కొనసాగుతున్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన మాదిరెడ్డి ప్రతాప్‌ వెయిటింగ్‌లో ఉన్నారు. నళిన్‌ ప్రభాత్‌ (1992), ఫైర్‌ డీజీ పీవీ సునీల్‌కుమార్‌, అమిత్‌ గార్గ్‌ తదితరులు ఉన్నారు. కాగా పీఎస్సార్‌కు అవకాశం వస్తే ఇంటిలిజెన్స్‌ డీజీగా పీవీ సునీల్‌కుమార్‌ను నియమించే అవకాశం లేకపోలేదని ప్రచారంలో ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement