Tuesday, May 7, 2024

భ‌ట్టి విక్ర‌మార్క‌ని ప‌రామ‌ర్శించిన మాజీ ఎంపీ పొంగులేటి.. ఏం చర్చించారంటే..

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి పాదయాత్ర శిబిరం వద్ద భేటీ అయ్యారు ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. వడదెబ్బ కారణంగా రెండు రోజులుగా అస్వస్థతకు గురైన భట్టి విక్రమార్కని ఈ సందర్భంగా పరామర్శించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. భట్టి విక్రమార్కని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అస్వస్థత నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ లో జరుగుతున్న రాజకీయ సమీకరణలపై ఇద్దరి మధ్యన ఏకాంతంగా సాగుతున్న చర్చలు ..ఖమ్మంలో జరగబోయే పాదయాత్ర ముగింపు సభ, పార్టీలో చేరికల అంశంపై ఈ సందర్భంగా వారి మధ్య చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement