Friday, May 3, 2024

Tirumala: ఉద్యోగుల జీతాల పెంపు …. 28న ఇళ్ల ప‌ట్టాలు పంపిణిః టిడిటి పాల‌క మండ‌లి ..

తిరుమల: ఉద్యోగుల‌కు తిరుమ‌ల పాల‌క మండ‌లి తీపి క‌బురు వినిపించింది.. జీతాల పెంపుతో పాటు ఇళ్ల ప‌ట్టాల‌ను సైతం ఇవ్వనున్న‌ట్లు ప్ర‌క‌టించింది.. టిటిడి ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర రెడ్డి అధ్య‌క్ష‌త‌న నేడు జ‌రిగిన పాల‌క‌మండ‌లి స‌మావేశంలో పలు నిర్ణ‌యాల‌ను తీసుకున్నారు.. ఆ వివ‌రాల‌ను భూమ‌న మీడియాకు వెల్ల‌డించారు.

ప‌స్తుతం ప‌ని చేస్తున్న 3,518 ఉద్యోగుల‌కు ఇంటి ప‌ట్టాలు ఈ నెల 28న ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు.. అలాగే ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఉద్యోగులకు సైతం త్వ‌ర‌లో ఇళ్ల ప‌ట్టాలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు.. పోటు,శానిటేష‌న్, కాంటాక్ట్ ఉద్యోగుల‌కు జీతాలు పెంచాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు భూమ‌న వెల్ల‌డించారు. అలాగే తిరుమ‌ల‌లో ఉండే మ‌ఠాల‌కు ప్యాకేజ్ ను కోటి రూపాయిల వ‌ర‌కూ పెంపు చేశారు.. ఝార్ఖండ్ లో శ్రీవారి ఆల‌యాన్ని నిర్మించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.


టీటీడీ పాలక మండలి నిర్ణయాలు ఇవే..
టీటీడీ ఉద్యోగులకు ఈనెల 28న 3,518 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయం
జనవరిలో మరో 1500 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయం
రిటైర్డ్ ఉద్యోగులు తదితరుల కోసం మరో 350 ఎకరాలు 85 కోట్లతో ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయం
శానిటేషన్ ఉద్యోగులు వర్క్ కాంట్రాక్టు ఉద్యోగులు వేతనాలు పెంచాలని నిర్ణయం
పోటు కార్మికులకు వేతనాలు 28 వేల నుండి 38 వేలుకు పెంపు, 10 వేలు పెంచాలని నిర్ణయం
వాహనం బేరర్లు, ఉగ్రాణం కార్మికులు, స్కిల్ లేబర్‌గా గుర్తించి తగిన విధంగా వేతనాలు పెంచాలని నిర్ణయం
ఫిబ్రవరిలో రెండు రోజులు పాటు దేశవ్యాప్తంగా పీఠాధిపతులను ఆహ్వానించి సదస్సు నిర్వహించాలని నిర్ణయం
కళ్యాణకట్టలో పీస్ రేట్ బార్బర్ల వేతనాలు కనీసం 20,000 ఇవ్వాలని నిర్ణయం
తిరుపతిలో పాత సత్రాలు తొలగించి కొత్త అతిథి గృహాల నిర్మాణం టెండర్లకు ఆమోదం
తిరుపతి పారిశుధ్యం పనులు కోర్టు తుది తీర్పుకు లోబడి ఆమోదించాలని నిర్ణయం
జార్ఖండ్ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం టీటీడీకి ఇచ్చిన 100 ఎకరాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని నిర్ణయం
చంద్రగిరిలో మూలస్థానం ఎల్లమ్మ ఆలయానికి అభివృద్ధి పనుల కోసం రెండు కోట్ల కేటాయింపు
శ్రీనివాస దివ్య అనుగ్రహ యాగం చేసే భక్తులకు 300 రూపాయల ప్రత్యేక దర్శనం కల్పించాలని నిర్ణయం
శ్రీవారి ఆలయ పెద్ద జీయార్‌, చిన్న జీయార్‌ మఠాలకు ప్రతీ ఏటా ఇచ్చే ప్యాకేజీకి మరో కోటి రూపాయలు పెంపు
పెద్ద జీయర్‌ మఠానికి రెండు కోట్లు నుండి రెండు కోట్ల 60 లక్షలకు పెంపు
చిన్న జీయర్‌ మఠానికి ఒక కోటి 70లక్షల నుండి 2 కోట్ల 10 లక్షలకు పెంపు.

Advertisement

తాజా వార్తలు

Advertisement