Monday, April 29, 2024

తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ప్రారంభం అయ్యాయి. అలయంలో ఉన్న కల్యాణోత్సవ మండపం ప్రాంగణంలో మూడు రోజుల పాటు వసంతోత్సవాలు జరుగనున్నాయి. కరోనా నేపథ్యంలో ఏకాంతంగా శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహిస్తున్నారు. బంగారు రథంపై మలయప్పస్వామి ఊరేగింపును తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. కరోనా విజృంభణ నేపథ్యంలో, భక్తులకు అనుమతి ఇవ్వకుండానే ఈ ఉత్సవాలను టీటీడీ నిర్వహిస్తోంది. కాగా, తిరుమలలో రద్దీ సాధారణం కన్నా తగ్గింది. నిన్న స్వామివారిని దాదాపు 15 వేల మంది దర్శించుకున్నారని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement