Friday, March 29, 2024

ఆటోను ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు వద్ద.. మిర్చి కూలీలతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో  10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని.. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, నాగరాజు, అలివేలుగా పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement