Friday, May 3, 2024

అమరావతిలో మొదలైన ఆర్ ఆర్ ఆర్ సినిమా సందడి..

అమరావతి, (ప్రభ న్యూస్) ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఆర్ఆర్ఆర్ సందడి నెలకొంది. శ్రీనివాస సినిమాస్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇరువురు హీరోల ఫ్యాన్స్ థియేటర్ వద్ద సందడి చేస్తున్నారు. పోటాపోటీగా బ్యానర్లు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ల ధర పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీంతో శ్రీనివాస థియేటర్ లో టిక్కెట్లు ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు కాకుండా అధిక ధరలకు విక్రయిస్తూ సినీ ప్రియులను దోచుకుంటున్నారు.

ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసేందుకు థియేటర్ల వద్దకు భారీగా క్యూలు కడుతున్నారు. సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఇరువురు అగ్రహీరోలు నటిస్తుండటంతో ఫ్యాన్స్ లో పండగ వాతావరణం నెలకొంది. అమరావతిలో మెయిన్ బజార్ , సినిమా థియేటర్ వద్ద రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సినిమా టికెట్లు సైతం రాజకీయ నాయకుల కనుసన్నలలో విక్రయాలు జరుపుతుండడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement