Sunday, May 5, 2024

Breaking: రోడ్ టెర్ర‌ర్‌.. క‌ర్నూలోలో కారు యాక్సిడెంట్‌.. స్పాట్‌లోనే ముగ్గురు..

కర్నూలు జిల్లాలో ఈరోజు ఉద‌యం లారీని కారు ఢీకొన్న ఘ‌ట‌న జ‌రిగింది. ఉలిందకొండ 44వ నెంబర్ జాతీయ రహదారి సాయిబాబా టెంపుల్ దగ్గర ఆగి ఉన్న లారీని కారు గుద్దేసింది. అనంతపురం జిల్లా ధర్మారం నుండి కర్నూలుకు వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే ముగ్గురు చ‌నిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు అనంతపురం జిల్లా ధర్మవరం చెందినవారని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement