Thursday, April 25, 2024

ఇవ్వాల జ‌న‌గామకు వెళ్ల‌నున్న‌ సీఎం కేసీఆర్‌.. కొత్త క‌లెక్ట‌రేట్ ప్రారంభం

తెలంగాణ‌లోని జనగామ జిల్లాలో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటించనున్నారు. ప్రజలకు సౌకర్యవంతమైన సేవలందించేందుకు ఒకేచోట ఏర్పాటు చేసిన సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని సీఎం ప్రారంభిస్తారు.

జ‌న‌గామ‌లోని సూర్యాపేట రోడ్డులో మూడేళ్ల క్రితం ఈ భవనానికి శంకుస్ధాపన చేయగా.. అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 25 ఎకరాల స్థ‌లంలో.. మూడంతస్తుల్లో భ‌వ‌నాన్ని నిర్మించారు… దాదాపు 32 కోట్ల వ్యయంతో 34 శాఖలు కొలువుతీరే విధంగా కొత్త కలెక్టరేట్ తీర్చిదిద్దారు. ఇవ్వాల సీఎం కేసీఆర్ చేతుల‌మీదుగా ఇది ప్రారంభం కాబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement