Sunday, May 19, 2024

AP : బాప‌ట్ల జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం….చిన్నారి మృతి..

బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం జ‌రిగింది. కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో చిన్నారి మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

- Advertisement -

ఈ విషాదకర సంఘటన కొరిశెపాడు మండలం గుడిపాడు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదేండ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement