Friday, April 26, 2024

బైక్ ఢీకొని.. ఆర్ఎంపీ వైద్యుడు మృతి

చీరాల, మార్చి 30(ప్రభ న్యూస్) : బైక్ అదుపు తప్పి రోడ్డు మార్జెన్ లో ఉన్న దిమ్మకు ఢీకొని ఆర్ఎంపీ వైద్యుడు మృతిచెందిన సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక హరిప్రసాద్ నగర్ కు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ సుబ్బారావు ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. అత్తగారింటికి గవినివారిపాలెం వెళ్లి అక్కడ నుంచి అర్ధరాత్రి తిరిగి వస్తుండగా పిట్టువారి పాలెం వచ్చే మలుపు వద్ద ప్రమాదవశాత్తు మోటార్ బైక్ అదుపు తప్పడంతో రోడ్డు మార్జన్ లో ఉన్న దిమ్మకు ఢీ కొట్టాడు. సృహతప్పి రోడ్డు ప్రక్కన సైడు కాల్వలో పడిపోయాడు. చిన్నగా రోడ్డు పైకి చేరుకొని అక్కడే మృతిచెందాడు.

తెల్లవారిన తర్వాత స్థానికులు చూసి బంధువులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఈపూరుపాలెం ఎస్ఐ జనార్దన్ సంఘటన స్థలానికి చేరుకొని మృతిపై అరా తీశారు. మృతదేహంను పోస్ట్ మార్టమ్ నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. భాదితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ప్రమాదం జరిగిందా, ఏదైనా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement