విశాఖపట్నం , ప్రభన్యూస్ బ్యూరో : సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం లభించింది. ఈ మేరకు ఆలయ ఇవో వి.త్రినాధరావు పర్యవేక్షణలో ఆలయ అధికారులు, సిబ్బంది హుండీలు తెరిచి లెక్కించారు. గడచిన 44 రోజులకు సంబంధించి 15 హుండీలు గురువారం లెక్కించగా రూ.1,73,13,159 ఆదాయం లభించింది. ఇంకా మరిన్ని హుండీలు లెల్కించాల్సి ఉంది. వీటితో పాటు బంగారం, వెండి కానుకలు కూడా భక్తులు పెద్ద మొత్తంలో సమర్పించారు. వివిధ దేశాలకు చెందిన విదేశీయ కరెన్సీ కూడా పెద్ద మొత్తంలో లభించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement