Friday, May 3, 2024

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న ర‌జ‌నీకాంత్.. అమీన్ పీర్ ద‌ర్గాని ద‌ర్శించుకోనున్న సూప‌ర్ స్టార్

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని త‌మిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. స్వామివారి ప్రత్యేక పూజల అనంతరం.. రజనీకాంత్‌ దంపతులకు ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

కాగా, రజనీకాంత్ కడప అమీన్‌పీర్‌ దర్గాను దర్శించుకోనున్నారు. ఆయనతోపాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహమాన్‌ కూడా దర్గాకు వెళ్లనున్నారు. ప్రత్యేక పూజల అనంతరం.. ఆలయ అర్చకులు రజనీకాంత్ కు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు. శ్రీవారి దర్శనం కోసం రజినీకాంత్‌ బుధవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. టీఎస్‌ఆర్‌ అతిథి గృహం వద్ద ఆయనకు టీటీడీ రిసెప్షన్‌ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌, ఓఎస్డీ రామకృష్ణ స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement