Sunday, April 28, 2024

అమరావతి రైతుల పాదయాత్రపై కుట్రలు: మంత్రి బొత్సపై RRR ఫైర్

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, అది రాజధాని రైతుల పాదయాత్ర కాదని, టీడీపీ కార్యకర్తల పాదయాత్ర అని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. దీనిపై నరసాపురం ఎంపీ  రఘురామకృష్ణరాజు తీవ్రంగా ఖండించారు. రాజధాని రైతులంటే టీడీపీ కార్యకర్తలన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు హాస్యాస్పదం అని అన్నారు. అమరావతి రైతుల మహాపాదయాత్ర దిగ్విజయంగా జరుగుతోందని ఆయన అన్నారు. రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. పాదయాత్ర సందర్భంగా దాడులు జరిగే ప్రమాదం కూడా ఉందన్నారు. రాజధాని రైతులపై మంత్రి బొత్స తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని రఘురామ డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: పెట్రో ధరలపై టీడీపీ ఉద్యమం.. ఏపీ సర్కార్ పై చంద్రబాబు ధ్వజం

Advertisement

తాజా వార్తలు

Advertisement