Sunday, April 28, 2024

GVL Narasimha Rao: రైల్వేలలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ప్ర‌ధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ రైల్వేలలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చార‌ని రాజ్యసభ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు పేర్కొన్నారు. అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ఆయన స్వాగతం పలికారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… రైల్వేస్టేషన్ లో జీవితం ప్రారంభించిన ప్రధాని మోడీ రైల్వేల రూపురేఖలు మారుస్తున్నారన్నారు.

మూడు వందేభారత్ ట్రైన్లు మన రాష్ర్టంలో సేవలందిస్తున్నాయని చెప్పారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ ఆగే 32 స్టాప్స్‌ ఏపీలోనే 14 ఉన్నాయన్నారు. పేదల కోసం నరేంద్ర మోడీ ఆలోచిస్తారన్నది మరోసారి రుజువైందన్నారు. అమృత్‌ భారత్ అధునాతన సర్వీసులు ఇవ్వాలనే ఉద్దేశంతో అమృత్‌ భారత్ ట్రైన్ సామాన్యులు, పేదలదన్నారు. రిజర్వేషన్ లేకుండా ప్రయాణించే వారికి, తక్కువ రుసుముతో అధునాతన సదుపాయాలు అందుబాటులో ఉంచారని ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement