Thursday, May 2, 2024

ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ 

ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ (పీ.ఆర్.సీ)గా నియమితులైన ప్రవీణ్ ప్రకాష్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామిని, అమ్మవారు దుర్గా దేవికి పూజలు నిర్వహించారు. అనంతరం ఏపీ భవన్ లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్ లో  ఏపీ భవన్ పీఆర్సీగా బాధ్యతలు స్వీకరించారు.  ఈ సందర్భంగా ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెండింగ్ సమస్యలను కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చేయడానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.పీ భవన్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement