Friday, April 19, 2024

ఆస్తి కోసం, తల్లిని హింసిస్తున్న కొడుకు.. తంతే వెళ్లి చెట్ల పొదల్లో పడిపోయింది.. వీడూ ఓ కొడుకేనా?

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి తన తల్లిపై దారుణంగా దాడి చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఓల్డ్​ ఏజ్​లో ఉన్న తల్లిని బాగా చూసుకోవాల్సింది పోయి. చేతిలో ఉన్న చెంబుతో తలపై బాదడం.. కాలితో తన్నడం వంటి వికృతపు చేష్టలు చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి బ్రహ్మానందపురంలో ఇవ్వాల జరిగింది. ఇరుగు పొరుగు వారి నుండి సమాచారం అందుకున్న పోలీసులు.. ఆస్తి కోసం తల్లిని హింసిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

నాగమణి భర్త వెంకటేశ్వరరావుకు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమిని కేటాయించింది. కష్టపడి ఇల్లు కూడా కట్టుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. నాగమణి భర్త మూడేళ్ల క్రితం మృతి చెందగా.. మరో గ్రామంలో పనిచేస్తున్న కుమారుడు శేషు తన భార్యతో కలిసి ఆమె వద్దకు వెళ్లాడు. అయితే చాలా రోజుల తర్వాత కొడుకు ఇంటికి వచ్చాడన్న ఆనందం ఆమెకు ఎంతోసేపు నిలవలేదు. ఉన్నట్టుండి ఆస్తి కోసం నాగమణిని చిత్రహింసలు పెట్టాడు శేషు. గతంలో కూడా ఇలాగే చేస్తుంటే.. స్థానికులు మందలించారు. అయినా శేషు తన తీరు మార్చుకోలేదు. చివరకు అతను తన తల్లిపై దాడి చేయడాన్ని రికార్డ్ చేసి సచివాలయ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. వారు పోలీసులకు సమాచారం అందించడంతో శేషును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement