Tuesday, May 21, 2024

వైయస్‌ఆర్‌ భీమా అందజేత..

మార్కాపురం: వైయస్‌ఆర్‌ భీమా పథకం మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసానిస్తుందని 24వ వార్డు కౌన్సిలర్‌ బుశ్శెట్టి నాగేశ్వరరావు పేర్కొన్నారు. పట్టణంలోని 24వ వార్డులోని తుమ్మలపెంట శకుంతలాదేవి వైయస్‌ఆర్‌ భీమా పథకంలో సభ్యులుగా ఉండి ఈనెల 19వ తేదీన అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. వైయస్‌ఆర్‌ భీమా పథకం ద్వారా రూ. 2 లక్షలకు అర్హులుగా గుర్తించి మట్టి ఖర్చుల నిమిత్తం 10వేల రూపాయలను నామినీ బాలసుబ్రహ్మణ్యంకు కౌన్సిలర్‌ బుశ్శెట్టి నాగేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిటీ మిషన్‌ మేనేజర్‌ అందుగుల ప్రసాద్‌, వార్డు పరిపాలనాధికారి గొలమారి అనిల్‌ కుమార్‌రెడ్డి, భీమామిత్ర కుమారి జి.ప్రవళికలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement