Friday, May 3, 2024

సిగ్గుచేటు.. ప్రభుత్వ కార్యాలయానికి మరోసారి పవర్ కట్

గుంటూరు జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి విద్యుత్ శాఖ అధికారులు మరోసారి కరెంట్ సరఫరా నిలిపివేశారు. రూ.1.45 లక్షల పాత బకాయిలు చెల్లించాల్సి ఉండటంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి విద్యుత్ నిలిచిపోవడంతో క్రయ, విక్రయదారులు నానా కష్టాలు పడుతున్నారు.

గతంలోనూ పాత బకాయిలు పెండింగ్‌లో ఉన్న కారణంగా పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేసినా సబ్ రిజిస్ట్రార్ అధికారులు తమ ప్రవర్తన మార్చుకోలేదు. గతంలో 2019 మార్చి నెలలో రూ.1.19 లక్షల పెండింగ్ బకాయిలు చెల్లించని కారణంగా విద్యుత్ శాఖ సిబ్బంది మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement