Sunday, May 5, 2024

మున్సిపల్‌ కార్మికుల సమస్యలు

మార్కాపురంటౌన్: మున్సిపల్‌ కార్యాలయ అధికారులు కార్మికులకు సంబంధించిన పిఎఫ్‌, ఈఎస్‌ఐ బిల్లులు చెల్లించకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని యూనియన్‌ కార్యదర్శి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. స్థానిక పూలసుబ్బయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంవత్సర కాలంగా పిఎఫ్‌ను మున్సిపల్‌ అధికారులు చెల్లించకపోవడంతో కార్మికులు సమస్యలను ఎదుర్కొంటున్నారని వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలోయూనియన్‌ అధ్యక్షుడు అందె నాసరయ్య, షేక్‌. ఖాశిం, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement