Sunday, April 28, 2024

నిజాయితీని చాటుకున్న ఆర్టీసి సిబ్బంది..

మార్కాపురంటౌన్ : ప్రయాణీకుడు పోగొట్టుకున్న నగదును మరలా తిరిగి అతనికి అందజేసి ఆర్‌టిసి సిబ్బంది తమ నిజాయితీని చాటుకున్నారు. వివరాల ప్రకారం మార్కాపురం డిపోకు చెందినన విజయవాడ మార్కాపురం బస్సులో గుంటూరు వాస్తవ్యులు కనకమేడల వేణుగోపాలరావు గుంటూరు నందు నరసరావుపేట వెళ్లేందుకు బస్సులో ఎక్కి నరసరావుపేటలో దిగే సమయంలో తన బ్యాగ్‌ మరిచిపోయారు. మరచిపోయిన బ్యాగును కండక్టర్‌ షేక్‌. కరీం డిపోలో అందజేయగా అందులో ఉన్న రూ. 33,760లను వారికి అందజేశారు. పోగొట్టుకున్న నగదును అందజేసిన సిబ్బందికి ప్రయాణీకుడు కృతజ్ఞతలు తెలిపారు. కండక్టర్‌ నిజాయితీని పలువురు మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌టిసి ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఖాజావ లి, ఏపిపిటిడి ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు బి.బి వెంకటేశ్వర్లు, సిహెచ్‌ జనార్థనరావు కార్యనిర్వాహక కార్యదర్శి సోమయాజుల శాస్త్రితో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement