Friday, May 10, 2024

ఖాతాదారులకు చేరువగా బంధన్‌ బ్యాంక్‌ సేవలు..

మార్కాపురం : పట్టణంలో బంధన్‌ బ్యాంక్‌ యూనిట్‌ సేవలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సంధర్భంగా ముందుగా బ్యాంకు వ్యవస్థాపకులు చంద్రశేఖర్‌ ఘోష్‌ను అభినందించారు. బంధన్‌ బ్యాంకు సేవలు ప్రజలకు చేరువగా చేసేందుకు అన్ని ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ యూనిట్‌లను ప్రారంభించతలపెట్టామన్నారు. మహిళల చిరు వ్యాపారాల అభివృద్దికి బ్యాంకు రుణం అందిస్తుందన్నారు. మహిళల ఆర్థిక పురోగతికి బ్యాంక్‌ అండగా నిలుస్తుందన్నారు. భారతదేశమంతటా 1100 కన్నా ఎక్కువ బంధన్‌ జనరల్‌ బ్రాంచీలు, 4వేల కంటే ఎక్కువ బ్యాంకింగ్‌ యూనిట్లు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికార సిబ్బంది డియం అశోక్‌, ఏడియం రసూల్‌, షమీమ్‌, ఎఎమ్‌ రాజ్‌మన్‌సింగ్‌, నాగప్రశాంత్‌, ఆర్‌ఓ ప్రసాద్‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement