Monday, May 20, 2024

యంపిడిఓకు వినతిపత్రం..

తర్లుపాడు : డ్రాయింగ్‌ అండ్‌ డిస్బర్సింగ్‌ ఆఫీసర్‌ అధికారం విఆర్‌ఓలకు బదలాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పంచాయితీ కార్యదర్శులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సంధర్భంగా పోతలపాడు పంచాయితీ కార్యదర్శి సుభాకర్‌ మాట్లాడుతూ ఎప్పటినుండో యంపిడిఓ కార్యాలయంలో ఉన్న పంచాయితీ కార్యదర్శులకు డిడిఓ అధికారాలను ఇపుడు విఆర్‌ఓలకు బదలాయించడం ఎంత వరకు సమంజసం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్ర భుత్వం వెంటనే స్పందించి కార్యదర్శులకే ఆ అధికారం ఉండేలా కొనసాగించాలని పంచాయితీ కార్యదర్శులు వినతిపత్రంలో పేర్కొన్నారు. అనంతరం యంపిడిఓ నరసింహులుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శులు వై.గీత, జె.పద్మ, జజ్జాది రంగస్వామి, ఎన్‌. తేజస్వి, మహేశ్వరి, బట్టు శ్రీను, మనోహర్‌రెడ్డి, ఆచారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement