Tuesday, May 14, 2024

ఆలయ పాలకమండలి ప్రమాణస్వీకారానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం..

మార్కాపురం : మర్రిపూడి మండలంలో వెలసిన శ్రీ పృధులగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డిని ఆయన నివాసంలో ఆర్యవైశ్య కార్పోరేషన్‌ చైర్మన్‌ కుప్పం ప్రసాద్‌, ఆలయ నూతన చైర్మన్‌ కుప్పం చిన్నకొల్లారావులు ఆహ్వానించారు. పవిత్ర పుణ్యక్షేత్రం అయిన పృధులగిరి దేవస్థాన చైర్మన్‌ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే నాగార్జునరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన ఒంగోల యంపి మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి, ఎమ్మెల్యే నాగార్జునరెడ్డిలను గజమాలతో వారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పొదిలి నిర్మమహేశ్వర దేవస్థాన చైర్మన్‌ కంకణాల రమేష్‌, ఈఓ రవికుమార్‌, రేగడపల్లి సర్పంచ్‌ బూదాల కమలాకర్‌ఒ, ఆర్యవైశ్య సంఘం కమిటీ జి.సి సుబ్బారావు, వేమకృష్ణ, కంకణాల రమేష్‌, యక్కలి శేషగిరి, మేడా నరసింహారావు, అనంత శ్రీనివాసులు, స్వామి రాజ, బండారు ప్రసాద్‌, కొండవీటి రంగారావు, కలువ మోహన్‌, యంఆర్‌కె కుప్పం సత్యం, యం. బాబు, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement