Sunday, April 28, 2024

బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా ‘చిడిపోతు హరికృష్ణ’

కందుకూరు : కందుకూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా సీనియర్‌ న్యాయవాది చిడిపోతు హరికృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన మరో సీనియర్‌ న్యాయవాది గోపాల కృష్ణ ప్రకటించారు. వైస్‌ ప్రెసిడెంట్‌గా కె.రాజశేఖర్‌ రెడ్డి, జనరల్‌ సెక్రటరీగా వి.వెంకట సుబ్బారావు, జాయింట్‌ సెక్రటరీగా సిహెచ్‌ మురళీధర్‌, కోశాధికారిగా సిహెచ్‌ నాగేంద్ర శర్మ, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ గా టి.తిరుమల రావు, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌-1 గా యం.జగదీష్‌, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ – 2 గా డి.మాధవరావు, లైబ్రేరియన్‌గా వివిఎ సుబ్బారామయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఏకగ్రీవంగా ఎన్నికైన చిడిపోతు హరికృష్ణను, కమిటీ సభ్యులను మాజీ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సన్నెబోయిన శ్రీనివాసులుతో పాటు సీనియర్‌ న్యాయవాదులు బెజవాడ కృష్ణయ్య చౌదరి, కె.వి.లక్ష్మినారాయణ, కె.హరికోటేశ్వరరావు, ప్రసాద రెడ్డి, బివి మురళీకృష్ణ తదితరులు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement