Saturday, April 27, 2024

గల్లంతైన విద్యార్థులలో – ఒకరి మృతదేహం లభ్యం

బల్లికురవ (ప్రభ న్యూస్) : మార్టూరు అంబేద్కర్ నగర్ కు చెందిన ఇద్ద‌రు విద్యార్థులు రాబర్ట్ విశాఖ్, వంశీలు ఆదివారం సాయంత్రం అద్దంకి బ్రాంచి కెనాల్లో ఈతకు దిగి గల్లంతైయ్యారు. వీరిలో రాబర్ట్ విశాఖ్ మృతదేహం సోమవారం లభ్యమైంది. ఎస్ ఐ వేమన ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది అద్దంకి బ్రాంచ్ కెనాల్ పరిధిలో పడవ సహాయంతో వెతుకుతుండగా, 34 వ మైలుకు సమీపంలో మృతదేహం లభ్యమైంది. మరో విద్యార్థి వంశీ మృతదేహం కోసం బ్రాంచి కెనాల్ పరిధిలోని మేజర్ లలోనూ, ప్రధాన కాలువలోనూ గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా వెతుకుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement