Thursday, May 16, 2024

టిఆర్‌ఆర్‌ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలకు స్పాట్‌ అడ్మిషన్స్…


కందుకూరు టౌన్‌ , టిఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ మరియు పిజి కళాశాలలో మూడవ దశ ప్రవేశాల అనంతరం మిగిలిన డిగ్రీ సీట్ల భర్తీకి స్పాట్‌ అడ్మిషన్లు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.రవికుమార్‌ తెలిపారు. ఇదివరకు మూడు దశలలో జరిగిన అడ్మిషన్ల ప్రక్రియలో ప్రవేశం పొందని విద్యార్ధులు మార్చి 10వ తేదీ నుండి 20వ తేదీ లోపల తమ ఒరిజినల్‌ సర్టిఫికేట్లతో కళాశాల నందు సంప్రదించాలని ప్రిన్సిపాల్‌ రవికుమార్‌ తెలిపారు. బి.ఏ, బిఎస్సీ, బిజెడ్‌సి, ఎంపిసి, ఎంపిసిఎస్‌, డేటా సైన్సు, అక్వా కల్చర్‌, బి.కామ్‌ జనరల్‌, బి.కామ్‌ కంప్యూటర్‌ సైన్సు కోర్సులలో ఖాళీలు ఉన్నట్లు ప్రిన్సిపాల్‌ తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement