Tuesday, May 14, 2024

దుప్పట్లు పంపిణీ

కందుకూరు టౌన్‌ , : కందుకూరు పట్టణంలోని ఐఎఫ్‌సి ఫౌండేషన్ఆ ధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గత రెండు సంవత్సరాలుగా ఐఎఫ్‌సి ఫౌండేషన్‌ పేదలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అదే విధంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏరియా హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఇంద్రాణి పాల్గొని 130 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఇంద్రాణి మాట్లాడుతూ ఐఎఫ్‌సి ఫౌండేషన్‌ వారు పేదలకు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఈ సంస్థ పేదలకు ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు సాజిద్‌, సెక్రటరీ షంషేర్‌, ఆర్గనైజర్‌ రహీమ్‌, హఫీజ్‌, రామకృష్ణ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement